
- నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ప్రమాదం
అమ్రాబాద్, వెలుగు: శ్రీశైలం ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఐపీఎస్ ఆఫీసర్, కాంట్రాక్టర్చనిపోయిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి సుధాకర్ భానుదాసు పతారే(54), కాంట్రాక్టర్భాగవత్ కిషన్ రావ్ ఖోడ్కే పాటిల్(66)తో పాటు మరికొందరు ఇన్నోవా కారులో శనివారం శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్తున్నారు. దోమలపెంట సమీపంలో హైదరాబాద్ కు వెళ్తున్న పికెట్ డిపో బస్సు, ఇన్నోవా కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఐపీఎస్ ఆఫీసర్ తో పాటు కాంట్రాక్టర్ తీవ్రంగా గాయపడగా అచ్చంపేట ఆస్పత్రికి, అక్కడినుంచి మెరుగైన చికిత్సకు వెల్దండ మండలంలోని యెన్నం హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయారు. డెడ్బాడీలకు కల్వకుర్తి ఆస్పత్రిలో పోస్ట్మార్టం చేసి బంధువులకు అప్పగించారు. నాగర్కర్నూల్ఎస్పీ గైక్వాడ్ వైభవ్రఘునాథ్ కల్వకుర్తి ఆస్పత్రికి వెళ్లి మృతుల బంధువులను పరామర్శించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకర్నాయక్ తెలిపారు.